rajani: రజనీ '2.ఓ' మూవీలో ఐశ్వర్యరాయ్!

  • శంకర్ దర్శకత్వంలో '2.ఓ'
  • రజనీ సరసన ఎమీ జాక్సన్ 
  • బయటికి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్  

రజనీకాంత్ .. ఐశ్వర్య రాయ్ జంటగా వచ్చిన 'ఎందిరన్' (రోబో) సినిమా సంచలన విజయాన్ని సాధించింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ముగ్గురి కెరియర్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. దాంతో శంకర్ '2. ఓ' సినిమాను రూపొందించాడు. ఇది 'ఎందిరన్' సినిమాకి సీక్వెల్ కాదని శంకర్ ముందుగానే చెప్పాడు. ఈ సినిమాలో రజనీ సరసన ఎమీజాక్సన్ కథానాయికగా నటించగా .. విలన్ గా అక్షయ్ కుమార్ నటించాడు.

ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుందనేది తాజా సమాచారం. ఇప్పటివరకూ ఈ విషయానికి సంబంధించిన వార్త బయటికి రాలేదు. కావాలనే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని అనుకున్నారట. 'ఎందిరన్' సినిమాకి '2.ఓ' సీక్వెల్ కానప్పుడు .. ఐశ్వర్య రాయ్ ఏ పాత్రలో కనిపించనుందనేది ఆసక్తికరంగా మారింది. ఏదేవైనా ఐశ్వర్యరాయ్ అభిమానులకు ఇది ఆనందాన్ని కలిగించే వార్తేనని చెప్పాలి.    

More Telugu News