NTR: ఐపీఎల్ తెలుగు కామెంటేటర్లు వీరే... ప్రత్యేక ఆకర్షణగా ఎన్టీఆర్!

  • తెలుగు కామెంటేటర్లుగా వెంకటపతి రాజు, వేణుగోపాల్ రావు
  • కల్యాణ్ కృష్ణ, వెంకటేశ్ లు కూడా
  • హైదరాబాద్ మ్యాచ్ లను దగ్గరుండి చూడనున్న ఎన్టీఆర్

కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే ఐపీఎల్ 11వ సీజన్ పోటీలు ఎల్లుండి నుంచి ప్రారంభం కానుండగా, తెలుగులో వ్యాఖ్యానం చెప్పే కామెంటేటర్ల పేర్లను స్టార్ గ్రూప్ ఖరారు చేసింది. ఈ పోటీలకు తెలుగులో ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుండగా, వెంకటపతి రాజు, వేణుగోపాల్‌ రావు, కల్యాణ్‌ కృష్ణ, సీ వెంకటేశ్‌, చంద్రశేఖర్‌, పీ సుధీర్‌ మహావాది తెలుగులో కామెంటేటర్లుగా పని చేయనున్నారని స్టార్ గ్రూప్ ఓ ప్రకటనలో తెలిపింది.

తెలుగుతో పాటు బంగ్లా, కన్నడ, తమిళ భాషల్లోనూ మ్యాచ్ ల ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయని వెల్లడించింది. స్టైలిష్ హైదరాబాద్ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ హిందీ కామెంటేటర్ గా వ్యవహరించనున్నాడు. మొత్తం 100 మంది కామెంటేటర్లు వివిధ భాషల్లో ఈ సంవత్సరం వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తారు. హైదరాబాద్ లో సన్ రైజర్స్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ నీ ఎన్టీఆర్ దగ్గరుండి తిలకిస్తూ, అభిమానులను, ఆటగాళ్లను ఉత్తేజ పరుస్తారని తెలుస్తోంది.

More Telugu News