sharwanand: శర్వానంద్ .. కల్యాణి ప్రియదర్శన్ షూటింగ్ మొదలైపోయింది!

  • సుధీరవర్మతో శర్వానంద్ మూవీ 
  • ఈ రోజునే రెగ్యులర్ షూటింగ్ మొదలు 
  • కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్  

ప్రస్తుతం శర్వానంద్ .. హను రాఘవపూడి మూవీ 'పడి పడి లేచే మనసు'తో బిజీగా వున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవి నటిస్తోంది. దాంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు మొదలైపోయాయి. ఈ నేపథ్యంలోనే సుధీర్ వర్మతోను శర్వానంద్ ఒక సినిమా చేస్తున్నాడు .. ఇది శర్వానంద్ కి 28వ సినిమా.

ఇంకా టైటిల్ ను నిర్ణయించని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజునే వైజాగ్ లో మొదలైంది. ఈ సినిమాలో శర్వానంద్ జోడీగా 'హలో' ఫేమ్ కల్యాణి ప్రియదర్శన్ ను తీసుకున్నారు. ఈ షెడ్యూల్లో నాయకా నాయికల మధ్య ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమా, శర్వానంద్ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందనీ .. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని దర్శకుడు సుధీర్ వర్మ బలంగా చెబుతున్నాడు. 

More Telugu News