nithin: ఆశ్చర్యపరుస్తోన్న 'ఛల్ మోహన్ రంగ' శాటిలైట్ రైట్స్

  • రేపు విడుదల కానున్న 'ఛల్ మోహన్ రంగ'
  • శాటిలైట్ హక్కుల కోసం గట్టిపోటీ 
  • సొంతం చేసుకున్న జీ తెలుగు ఛానల్

'ఛల్ మోహన్ రంగ' సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నితిన్ .. మేఘా ఆకాశ్ జంటగా నటించిన ఈ సినిమా కోసం యూత్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా శాటిలైట్ హక్కులకు గట్టిపోటీ ఏర్పడిందట. దాంతో జీ తెలుగు వారు శాటిలైట్ హక్కులతో పాటు డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు గాను వాళ్లు 5 కోట్లు చెల్లించారని అంటున్నారు.

ఈ సినిమాకి త్రివిక్రమ్ .. పవన్ కల్యాణ్ లు కూడా నిర్మాతలు కావడం వలన ఈ ప్రాజెక్టుకు క్రేజ్ పెరిగింది. ఇక ఈ సినిమాకు కథను త్రివిక్రమ్ అందించాడు .. అంతేకాదు స్క్రీన్ ప్లే - మాటలు కూడా ఆయన పర్యవేక్షణలోనే జరిగాయట. అందువల్లనే ఈ సినిమా శాటిలైట్ .. డిజిటల్ హక్కులను ఈ స్థాయి రేటుకు జీ తెలుగు వారు దక్కించుకున్నట్టు సమాచారం.   

More Telugu News