guntur: గుంటూరు రావడం ఆనందంగా ఉంది.. ఇప్పుడే పెళ్లి చేసుకోను!: హీరో నితిన్

  • సిమ్స్ కళాశాలలో ‘ఛల్ మోహన్ రంగ’ చిత్ర యూనిట్ సందడి
  • నితిన్, మేఘా ఆకాష్ తో సెల్ఫీలకు ఆసక్తి చూపిన విద్యార్థులు
  • ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఛల్ మోహన్ రంగ’

హీరో నితిన్ నటించిన ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గుంటూరులో ఈరోజు చిత్ర ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. సిమ్స్ కళాశాలలో ఛల్ మోహన్ రంగ చిత్ర యూనిట్ సందడి చేసింది. హీరో నితిన్, హీరోయిన్ మేఘా ఆకాష్ ని చూసేందుకు, వారితో సెల్ఫీలు దిగేందుకు విద్యార్థులు ఆసక్తి చూపారు.

గుంటూరు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఐదో తేదీన విడుదల కానున్న తన చిత్రాన్ని విజయవంతం చేయాలని నితిన్ కోరాడు. ఈ చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని చెప్పిన నితిన్, రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని చెప్పారు. కొత్తగా మూడు చిత్రాల్లో నటించేందుకు అంగీకరించానని, ఇందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నట్టు నితిన్ చెప్పాడు.  

More Telugu News