nithin: యూఎస్ఏ లో 'ఛల్ మోహన్ రంగ' భారీ రిలీజ్

  • నితిన్ హీరోగా 'ఛల్ మోహన్ రంగ'
  • కథానాయికగా మేఘా ఆకాశ్ 
  • ఈ నెల 5వ తేదీన భారీ రిలీజ్  

నితిన్ కథానాయకుడిగా కృష్ణచైతన్య దర్శకత్వంలో 'ఛల్ మోహన్ రంగ' సినిమా రూపొందింది. మేఘ ఆకాశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను ఈ నెల 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. యూఎస్ఏ లో ఈ సినిమాను 130కి పైగా లొకేషన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. నితిన్ మూవీ యూఎస్ఏలో ఈ స్థాయిలో విడుదలవుతుండటం ఆయన కెరియర్లో ఇదే మొదటిసారి అని అంటున్నారు.

 ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా, తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. రీసెంట్ గా రిలీజైన 'ఛల్ మోహన్ రంగ' సినిమా ట్రైలర్ కు అనూహ్యమైన రీతిలో రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా తప్పకుండా భారీ విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో నితిన్ వున్నాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్ .. పవన్ లు కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తుండటం విశేషం.

More Telugu News