Pooja: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • ప్లానింగ్ లేదంటున్న పూజా హెగ్డే 
  • జూలై నుంచి 'సంఘమిత్ర' షూటింగ్ 
  • రవితేజ సినిమాలో బాలీవుడ్ విలన్ 
  • నితిన్ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికేట్

 *  కెరీర్ పరంగా ప్లాన్ అంటూ ఏదీ తనకు లేదని చెబుతోంది అందాలతార పూజా హెగ్డే. "ఫలానా భాషలో ఇన్నేసి సినిమాలు చేయాలని నాకు నియమాలేవీ లేవు. ఎక్కడ మంచి ఆఫర్లు వస్తే అక్కడ చేస్తాను. కథ నచ్చితే చాలు, చేసేస్తాను. అంతకు మించి కెరీర్ పరంగా నాకేమీ ప్లానింగ్ లేదు" అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.
*  తమిళ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో రూపొందే 'సంఘమిత్ర' భారీ చిత్రం షూటింగును జూలై నుంచి రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆర్య, జయం రవి హీరోలుగా నటించే ఈ చిత్రంలో దిశా పఠాని కథానాయికగా నటిస్తుంది. 400 కోట్ల బడ్జెట్టుతో నిర్మించే ఈ చిత్రం కోసం భారీ సెట్స్ ను డిజైన్ చేస్తున్నారు.
*  రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'అమర్ అక్బర్ ఆంథోని' చిత్రంలో బాలీవుడ్ నటుడు విక్రం జీత్ విలన్ గా నటించనున్నాడు. అనూ ఇమ్మానుయేల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది.
*  నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిన 'చల్ మోహన్ రంగా' చిత్రం సెన్సార్ పూర్తయింది. దీనికి సెన్సార్ నుంచి క్లీన్ U సర్టిఫికేట్ లభించింది. ఈ శుక్రవారం ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.  

More Telugu News