radhika reddy: న్యూస్ యాంకర్ రాధిక ఆత్మహత్య వార్త విని షాక్ అయిన రష్మీ గౌతమ్

  • వీ6 యాంకర్ రాధికారెడ్డి మరణంపై ఆవేదన వ్యక్తం చేసిన రష్మీ
  • ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన బాధలు పోవంటూ ట్వీట్
  • ఉదయాన్నే ఆత్మహత్యల వార్తలు చూడటం బాధను కలిగిస్తుంది

తెలుగు న్యూస్ ఛానల్ వీ6 కు చెందిన యాంకర్ రాధికారెడ్డి ఆపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఆమె మరణంపై పలువురు సినీ, టీవీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ స్పందిస్తూ, ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన బాధలు తొలగిపోవని ట్వీట్ చేసింది. మెరుగైన జీవితాన్ని గడిపే అవకాశాన్ని ఆత్మహత్య దూరం చేస్తుందని చెప్పింది.

రాధికను తాను ఎప్పుడూ కలవనప్పటికీ... ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపింది. ఈ రోజుల్లో డిప్రెషన్ అనేది అతి పెద్ద సమస్యగా పరిణమించిందని చెప్పింది. ఎప్పుడైనా అప్ సెట్ అయినప్పుడు కుటుంబసభ్యులు, స్నేహితులతో గడపాలని సూచించింది. ఉదయాన్నే ఆత్మహత్యలకు సంబంధించిన వార్తలు చూడటం ఎంతో బాధను కలిగిస్తుందని చెప్పింది. 

More Telugu News