Cricket: కోచ్, మెంటార్ గా కొత్త పాత్రలో ఇర్ఫాన్ పఠాన్

  • 2003 నుంచి 2012 వరకు భారత్ కు ప్రాతినిధ్యం వహించిన ఇర్ఫాన్ 
  • చక్కని ఆల్ రౌండర్ గా గుర్తింపు
  • జమ్ము,కశ్మీర్ జట్టుకు కోచ్, మెంటార్ గా నియామకం

టీమిండియా వెటరన్ ఆల్ రౌండర్ ఇర్పాన్‌ పఠాన్‌ కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టనున్నాడు. టీమిండియాలో పునరాగమనం కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఇర్ఫాన్ పఠాన్, అది సాధ్యం కాకపోవడంతో కోచ్, మెంటార్ గా మారనున్నాడు. ఈ మేరకు జమ్మూ కశ్మీర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ తో ఒప్పందం చేసుకున్నాడు. 2018-19 సీజన్‌ కు జమ్మూ, కశ్మీర్ క్రికెట్ జట్టుకు ఇర్ఫాన్‌ పఠాన్‌ ను కోచ్‌, మెంటార్‌ గా నియమించినట్టు జేకేసీఏ వెల్లడించింది. కాగా, 2003-12 కాలంలో 29 టెస్టులు, 120 వన్డేలు, 24 అంతర్జాతీయ టీ20లలో ఇర్ఫాన్ పఠాన్ భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. 

More Telugu News