BJP: పేపర్ లీక్ చేసేదీ మీరే.. ఆందోళనలు చేసేదీ మీరే!: ఏబీవీపీపై విద్యార్థి సంఘాల ఆగ్రహం

  • లీకేజీ ప్రధాన ముద్దాయి ఛాత్రా జిల్లా ఏబీవీపీ అధ్యక్షుడు సతీష్ పాండే
  • సతీష్ పాండేను అరెస్టు చేసిన జార్ఖండ్ పోలీసులు
  • ప్రభుత్వానికి, సీబీఎస్‌ఈ బోర్డుకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనల్లో పాలు పంచుకుంటున్న ఏబీవీపీ

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సిట్‌ ఆధికారుల బృందం చేపట్టిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. లీకేజీలో కీలక సూత్రధారులంతా బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీలో కీలక నేతలు కావడంపై పలు విద్యార్థి సంఘం నేతలు మండిపడుతున్నారు. పదో తరగతి మ్యాథ్స్‌ పేపర్‌ లీకేజీలో ప్రధాన ముద్దాయిగా అనుమానిస్తున్న సతీశ్‌ పాండేను జార్ఖండ్‌ పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు.

పాండే ఛాత్రా జిల్లా ఏబీవీపీ అధ్యక్షుడుగా ఉంటూ, జత్రాహిబాగ్‌ (జార్ఖండ్‌) లో ‘స్టడీ విజన్‌’ పేరుతో కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. మరోవైపు ప్రభుత్వానికి, సీబీఎస్‌ఈ బోర్డుకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనల్లో ఏబీవీపీ పాలుపంచుకోవడంపై ఇతర విద్యార్థి సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ‘‘మీరే లీకేజీలు చేస్తూ, తప్పును కప్పిపుచ్చుకోవడానికి మీరే ఆందోళనలకు నాయకత్వం వహించడం ఎంత దారుణం" అంటూ మండిపడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ అనుబంధ విద్యార్థి సంఘాలు సతీశ్‌ పాండే ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతూ, బీజేపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

More Telugu News