Peddapalli District: పెద్దపల్లిలో బీజేపీ నాయకుడిపై హత్యాయత్నం!

  • కాల్వశ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లిలో సంఘటన
  • ఈర్ల శంకర్ పై కత్తులతో దాడి  
  • పాతకక్షలే కారణమంటున్న పోలీసులు

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో బీజేపీ నాయకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లిలో బీజేపీ నాయకుడు ఈర్ల శంకర్ పై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ శంకర్ ను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టు అనుమానిస్తున్నామని, నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.

More Telugu News