BJP: అన్నం పెట్టిన చేతినే బీజేపీ నేతలు నరికేస్తున్నారు : బుద్దా వెంకన్న

  • మాతో పొత్తు లేకుండా వాళ్లిద్దరూ ఎమ్మెల్సీలు కాగలిగేవారా?
  • రాజధాని నిర్మాణానికి అప్పులివ్వాలనడంపై రాద్ధాంతం తగదు
  • ఈ పరిస్థితికి కారణం బీజేపీ కాదా?  

ప్రజల కోసం పోరాడతారని పదవులు ఇస్తే, అన్నం పెట్టిన చేతినే బీజేపీ నేతలు నరికేస్తున్నారని ఏపీ టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీతో పొత్తు లేకుండా సోము వీర్రాజు, మాధవ్ లు ఎమ్మెల్సీలు కాగలిగేవారా? అఖిలపక్షం భేటీకి బీజేపీ ఎందుకు హాజరు కాలేదు? అని ప్రశ్నించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ అప్పులివ్వాలని చంద్రబాబు చేసిన ప్రకటనపై బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని, ఈ పరిస్థితికి కారణం బీజేపీ కాదా? అని మండిపడ్డారు. ప్రధాని మోదీ వీడియోలు అసెంబ్లీలో ప్లే చేస్తే బీజేపీ నేతల కుర్చీలు కదులుతున్నాయని విమర్శించారు.

More Telugu News