Vijay Mallya: మాల్యా మూడో పెళ్లి వార్తలపై సోషల్ మీడియాలో సెటైర్లు!

  • మాల్యా-పింకీ పెళ్లిపై ట్విట్టర్‌లో సెటైర్లు
  • మాల్యాని పట్టుకునేందుకు నిఘా సంస్థలు పింకీని దింపాయి
  • తండ్రీ కొడుకుల మధ్య తమాషా జోక్ 

మనదేశంలోని బ్యాంకులకు దాదాపు 9 వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి ప్రస్తుతం లండన్‌లో తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మూడో పెళ్లి వార్తలపై సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తోంది. "విజయ్ మాల్యా మూడో పెళ్లి వెనుక ఓ కుట్ర దాగుంది. ఇది నిజానికి ఓ హనీ ట్రాప్. మాల్యా ప్రేయసి పింకీ లల్యాణీని నిఘా సంస్థలు రంగంలోకి దించాయి. పెళ్లయ్యాక భారత్‌లోని తన కుటుంబాన్ని చూడాలంటూ ఆమె మాల్యాని బలవంతపెడుతుంది. రాగానే పోలీసులు అతన్ని అరెస్టు చేస్తారు" అంటూ ట్విట్టర్‌లో ఒకరు మాల్యా-లల్వాణీ పెళ్లిపై సెటైర్ వదిలారు.

  'ఓ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను' అని మాల్యా కొడుకు తన తండ్రిని అడిగితే...అందుకు 'కొడకా... ఓ అమ్మాయిని నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను' అని ఆయన కూడా తిరిగి తన కొడుకును అడుగుతారని మరొకరు సెటైర్ వేశారు.

More Telugu News