Balakrishna: 'దాన వీర శూర కర్ణ' సెట్ లో 'ఎన్టీఆర్' తొలి షాట్... అదిరిపోయిన బాలయ్య ముహూర్తపు డైలాగ్!

  • అధికారికంగా మొదలైన షూటింగ్
  • క్లాప్ కొట్టిన వెంకయ్య
  • కర్ణుడిని రాజ్యాభిషిక్తుడను చేసే సీన్
  • అదిరిపోయిన బాలయ్య డైలాగ్

దివంగత ఎన్టీ రామారావు బయోపిక్ అధికారికంగా ప్రారంభమైపోయింది. కొద్దిసేపటి క్రితం ఈ చిత్రం షూటింగ్ ను వెంకయ్యనాయుడు క్లాప్ కొట్టి ప్రారంభించగా, దర్శకుడు బోయపాటి తొలి షాట్ కు దర్శకత్వం వహించాడు. ప్రత్యేకంగా వేసిన 'దాన వీర శూర కర్ణ' సినిమా సెట్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. తొలి దృశ్యంగా కర్ణుడిని రాజ్యాభిషిక్తుడను చేసే సీన్ ను చిత్రీకరించగా, కోట శ్రీనివాసరావు దృతరాష్ట్రుడి పాత్రలో కనిపించగా, జీవీ తదితర నటీనటులు ఇతర పాత్రల్లో కనిపించారు. "ఓహో... రాచరికమా అర్హతను నిర్ణయించునది. సోదరా దుశ్శాసనా... మామా గాంధార సార్వభౌమా... పరిజనులారా... పుణ్యాంగనులారా" అన్న సూపర్ హిట్ డైలాగును తనదైన శైలిలో చెప్పారు.

More Telugu News