sri reddy: మీకు రాజభోగాలు జరుగుతున్నాయని నచ్చినట్టు మాట్లాడకండి!: రకుల్ ప్రీత్ కి శ్రీరెడ్డి హెచ్చరిక

  • పబ్లిసిటీ కోసం మేము మీడియాకెక్కడం లేదు
  • కోట్లు సంపాదిస్తున్నారని నచ్చినట్టు మాట్లాడకండి
  • పూటగడవడం కోసం చాలా మంది కష్టపడుతున్నారు

పబ్లిసీటీ కోసం తాము మీడియాకెక్కడం లేదని సినీ నటి శ్రీరెడ్డి తెలిపింది. రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసింది. తాను నార్త్ ఇండియా నుంచి వచ్చిన వారి గురించి మాట్లాడలేదని తెలిపింది.

'అమ్మా! మీరు స్టార్ హీరోయిన్ అయిపోయారని, మీకు రాజభోగాలు జరుగుతున్నాయని, కోట్ల కొద్దీ డబ్బు ఉందని నచ్చినట్టు మాట్లాడకండి.. ఇక్కడ కడుపు మంటతో చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు' అని చెప్పింది. వారికోసమే తాను మాట్లాడానని పేర్కొంది. తామంతా కడుపునిండా తినడం కోసం కష్టపడుతున్నామని చెప్పింది. తామేమీ పబ్లిసిటీ కోసం లేనిపోనివి మాట్లాడడం లేదని శ్రీరెడ్డి స్పష్టం చేసింది. నిజాలే మాట్లాడుతున్నామని మరోసారి స్పష్టం చేసింది. కాగా, గత కొంత కాలంగా మీడియాలో శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు టాలీవుడ్ లో పెను కలకలం రేపిన సంగతి తెలిసిందే. 

More Telugu News