Pawan Kalyan: పవన్ చెప్పే ప్రతి దానికి ‘జీ హుజూరు’ అనేందుకు మేమేమైనా పిచ్చోళ్లమా? : నటుడు శివాజీ

  • ప్రశ్నించమని పవన్ అంటారుగా, అందుకే ఆయన్ని ప్రశ్నిస్తున్నా
  • పాచిపోయిన లడ్డూలిచ్చారన్న పవన్ లో ఎంతమార్పు?
  • లోకేశ్ పై అవినీతి ఆరోపణలు చేయడం తగదు

‘ప్రశ్నించండి’ అని పవన్ కల్యాణ్ అన్నారుగా, అందుకే, ఆయన్ని తాను ప్రశ్నిస్తున్నానని ఏపీకి న్యాయం చేయాలని పోరాడుతున్న ప్రముఖ నటుడు శివాజీ అన్నారు. ‘ఎన్టీవీ’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘‘ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు’ అంటూ నాడు పవన్ కల్యాణ్ చేసిన సుదీర్ఘ  ప్రసంగం అందరికీ నచ్చింది. పవన్ కల్యాణ్ రోడ్డు మీదకొస్తే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని ఆ తర్వాత నేను చెప్పాను. మొన్న, గుంటూరు బహిరంగ సభలో పవన్ మాట్లాడిన విధానాన్ని పరిశీలిస్తే చాలా మార్పు కనపడింది.

ప్రధాన మంత్రి మనల్ని పట్టించుకునే పరిస్థితిలో లేరని చెప్పిన పవన్ కల్యాణ్.. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రధాని తనతో బాగానే ఉంటారని చెప్పారు. మూడు సంవత్సరాల్లో పవన్ చక్కగా మూడు సినిమాలు చేసుకున్నారు... చక్కగా సంపాదించేసుకున్నారు. మొన్న బహిరంగసభలో లోకేశ్ పై అవినీతి ఆరోపణలు చేశారు. ఆధారాలేవని అడిగితే.. ‘బయట అనుకుంటున్నారు’ అని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. మీరు ఎంత గొప్ప హీరో అయినప్పటికీ, మీరు చెప్పే ప్రతిదానికీ ‘జీ హుజూరు’ అనడానికి మేము ఏమైనా పిచ్చోళ్లమా? ప్రశ్నించమని మీరే అన్నారు, అందుకే, ప్రశ్నిస్తున్నాను’ అని అన్నారు శివాజీ.

More Telugu News