Chandrababu: చంద్రబాబు దగాకోరు రాజకీయాలు చేస్తున్నారు : జీవీఎల్ నరసింహారావు

  • సీనియర్ రాజకీయనాయకుడినంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు
  • రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుందనే నాడు మాతో పొత్తు 
  • ఏపీలో ఆపరేషన్ గరుడ లాంటివి ఏమీ లేవు
  • 2019లో బీజేపీకి ఏ పార్టీతో పొత్తు ఉండదు  

రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల గురించి చెప్పకుండా, చంద్రబాబు దగాకోరు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సినిమాలు లేని ఓ హీరో, సీనియర్ రాజకీయ నాయకుడి పేరుతో చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

నాలుగేళ్లు కేంద్ర మంత్రులుగా ఉన్న సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీజేపీని చూసి ప్రాంతీయ పార్టీలకు గుబులు పట్టుకుందని, రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుందనే భయంతో 2014లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయ పార్టీలన్నీ ప్రత్యేక హోదాపై ప్రజలను మభ్యపెడుతున్నాయని, ఏపీలో ఆపరేషన్ గరుడ లాంటివి ఏమీ లేవని, బీజేపీ అంటే కేవలం దడ మాత్రమేనని అన్నారు. 2019లో బీజేపీకి ఏ పార్టీతో పొత్తు ఉండదని ఈ సందర్భంగా జీవీఎల్ స్పష్టం చేశారు.

More Telugu News