Uttar Pradesh: కాలేజీ అమ్మాయిలను తెచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న హోటల్ యజమాని!

  • నిత్యమూ వేలాది మంది పర్యాటకులు వచ్చే ఆగ్రా
  • కుమార్తె, కుమారుడి సాయంతో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మహిళ
  • ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

నిత్యమూ వేలాది మంది పర్యాటకులు సందర్శించే ఆగ్రాలో ఓ హోటల్ యజమాని నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్ ను బట్టబయలు చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఆగ్రా ఏఎస్పీ రవీనా త్యాగి వెల్లడించిన వివరాల ప్రకారం, వారానికి రూ. 20 వేలు ఇచ్చే కాంట్రాక్టు ఒప్పందంపై ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ కళాశాల విద్యార్థినులను తీసుకు వచ్చిన ఓ హోటల్ యజమాని, వారితో వ్యభిచారం చేయిస్తున్నాడు.

భర్తను కోల్పోయి హోటల్ ను నడుపుతున్న ఓ మహిళ, తన కుమారుడు, కుమార్తె సాయంతో ఈ సెక్స్ రాకెట్ నిర్వహిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు, స్పెషల్ టీమ్ తో వెళ్లి దాడులు చేశారు. మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. హోటల్ గదుల చెత్తకుండీల నుంచి కండోమ్ లు, రిసెప్షన్ డెస్క్ నుంచి వాటికి సంబంధించిన కార్టన్ లను స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, వ్యభిచార గృహం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని రవీనా త్యాగి వెల్లడించారు.

More Telugu News