charan: రాజమౌళి మల్టీస్టారర్ లో విలన్ గా రాజశేఖర్?

  • రాజమౌళి తదుపరి ప్రాజెక్టుగా మల్టీస్టారర్
  • కథానాయకులుగా ఎన్టీఆర్ .. చరణ్ 
  • అక్టోబర్ నుంచి సెట్స్ పైకి     

గతంలో స్టార్ హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న జగపతిబాబు, ఆ తరువాత విలన్ గా ఫుల్ బిజీ అయ్యారు. ఇక శ్రీకాంత్ కూడా అదే రూట్లో ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక తాజాగా హీరో రాజశేఖర్ కూడా విలన్ పాత్రలపై దృష్టి పెట్టారు. విలన్ పాత్రలు చేయడానికి కూడా తాను సిద్ధంగానే వున్నానంటూ 'గరుడవేగ' సినిమా సమయంలో ఆయన స్పష్టం చేశారు.

దాంతో రాజమౌళి తన తదుపరి సినిమా కోసం రాజశేఖర్ ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ఈ రోల్ చేయడానికి రాజశేఖర్ వెంటనే ఓకే చెప్పాడని అంటున్నారు. ఎన్టీఆర్ .. చరణ్ లతో రాజమౌళి ఒక మల్టీస్టారర్ చేయనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి .. రామారావు .. రామ్ చరణ్ అనే అర్థంలో #RRR అంటూ అభిమానులలో ఆసక్తిని రేకెత్తించారు. ఇక రాజశేఖర్ ఈ సినిమాలో చేయడం ఖాయమైతే మరో R వచ్చి చేరుతుందని చెప్పుకుంటున్నారు.    

More Telugu News