TTD: తిరుమలలో అపశ్రుతి... కిందపడిన అమ్మవారి విగ్రహం... రహస్యంగా శాంతి హోమం!

  • సోమవారం నాడు ఘటన
  • అర్చకుని వయోభారం కారణంగా చేజారిన విగ్రహం 
  • వివరణ ఇచ్చిన టీటీడీ అధికారులు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవ మూర్తులను తీసుకెళుతున్న సమయంలో అమ్మవారి విగ్రహం అర్చకుని చేతుల నుంచి జారి కిందపడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన సోమవారం నాడు జరుగగా, విగ్రహం కింద పడిందన్న విషయాన్ని బయటకు రానీయకుండా, రహస్యంగా శాంతి హోమాన్ని అర్చకులు నిర్వహించినట్టు తెలుస్తోంది.

ఈ అపశ్రుతి గురించి సదరు దృశ్యాలను చూసిన భక్తులు బయట పెట్టడంతో, టీటీడీ అధికారులు వివరణ ఇచ్చారు. వయోభారం కారణంగా అర్చకుడు విగ్రహాన్ని తెస్తున్న వేళ ఘటన జరిగిందని, విగ్రహం బరువుగా ఉండటంతోనే చేయి జారిందని తెలిపారు.

More Telugu News