honey bees: తేనెటీగల దెబ్బకు శవాన్ని వదిలేసి ఉరుకులు, పరుగులు పెట్టిన జనం!

  • శవయాత్ర జరుగుతుండగా టపాసులు పేల్చిన బంధువులు
  • తేనె పట్టుకు తగిలిన టపాసులు
  • తేనెటీగల దాడిలో నలుగురికి గాయాలు

శవయాత్ర జరుగుతుండగా తేనెటీగలు వీరవిహారం చేశాయి. దీంతో, శవాన్ని అక్కడే వదిలేసి ఉరుకులు పరుగులు పెట్టారు జనం. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఓదెల మండలం శానంగొండ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన గొల్లపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన ఓదెమ్మ అనే వృద్ధురాలు మృతి చెందడంతో... ఆమెకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఆమె అంతిమయాత్ర నిర్వహిస్తున్న సమయంలో, టపాసులు పేల్చారు.

ఈ నేపథ్యంలో, టపాసులు చెట్టుపై ఉన్న తేనెపట్టుకు తగిలాయి. దీంతో, ఒక్కసారిగా తేనెటీగలు జనాలపై దాడి చేశాయి. షాక్ కు గురైన జనాలు... భయంతో శవాన్ని అక్కడే వదిలేసి, ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఒక గంట అనంతరం ఆమె అంత్యక్రియలను పూర్తి చేశారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. 

More Telugu News