IPL: పావుగంట ఐపీఎల్ షోకి 5 కోట్లు డిమాండ్ చేసిన హీరో...!

  • 15 నిమిషాల ప్రదర్శనకు 5 కోట్లు డిమాండ్ చేసిన హీరో రణ్‌వీర్ సింగ్..!
  • ఏప్రిల్ 6 నుంచి మొదలుకానున్న ఐపీఎల్-11వ సీజన్
  • మే 27న ముంబైలోని వాంఖేడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్

గత పదేళ్లుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్వంటీ-20 టోర్నీ ప్రస్తుత సీజన్ వచ్చే నెల 7 నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా బాలీవుడ్ తారలతో ప్రారంభోత్సవాన్ని నిర్వాహకులు ధూంధాంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం బాలీవుడ్‌లో మాంఛి జోరుమీదున్న హీరో రణ్‌వీర్ సింగ్‌ను వారు కలిసినట్లు తెలిసింది. పావు గంట ప్రదర్శన ఇవ్వడానికి అంగీకరించిన ఆయన పారితోషికం కింద తనకు రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. అందుకు నిర్వాహకులు కూడా ఓకే చెప్పారట. ఐపీఎల్ 11వ సీజన్ ఏప్రిల్ 7-మే 27 తేదీల మధ్య జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ ముంబైలోని వాంఖేడీ స్టేడియంలో జరుగుతుంది.

More Telugu News