Narendra Modi: మోదీని దూషించారంటూ సినీ నటుడు శివాజీపై పోలీసులకు ఫిర్యాదు

  • మోదీని ‘ఇడియట్’ అని శివాజీ దూషించారు
  • విజయవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
  • శివాజీపై కేసు నమోదు చేయాలన్న బీజేపీ నేతలు  

ప్రధాని నరేంద్ర మోదీపై సినీ నటుడు శివాజీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ‘ఆపరేషన్ ద్రవిడ’ పేరిట బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేసిన శివాజీ, మోదీని ‘ఇడియట్’ అని దూషించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మోదీ ప్రతిష్టకు భంగం వాటిల్లే వ్యాఖ్యలు చేసిన శివాజీపై కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు తమ ఫిర్యాదులో కోరారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించారు.

More Telugu News