manchu lakshmi: నటీమణులపై నీచంగా మాట్లాడతారా? వదిలే ప్రసక్తే లేదు: మంచు లక్ష్మి

  • పబ్లిసిటీ కోసం సినీ పరిశ్రమలోని మహిళలపై నీచంగా మాట్లాడతారా?
  • ఇంతకంటే నీచం మరొకటి ఉండదు
  • దీన్ని ఇంతటితో వదిలిపెట్టను

సినీ పరిశ్రమ గురించి, అందులో పని చేసే వారి గురించి అసభ్యకరంగా మాట్లాడారంటూ ఓ టీవీ ఛానల్ ఎడిటర్ పై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. మా అధ్యక్షుడు శివాజీ రాజాతో పాటు పలువురు నటీనటులు సదరు ఎడిటర్ పై కేసు ఫైల్ చేయించారు.

తాజాగా ఈ వివాదంపై మంచు లక్ష్మి ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'విషయం ఏదైనప్పటికీ మహిళలను ఇలా లేబులింగ్ చేస్తూ ఏ ఒక్కరు కూడా అలాంటి మాటలు మాట్లాడరాదు. నటీమణులను ఉద్దేశిస్తూ అలా మాట్లాడటాన్ని ఏ ఒక్కరూ సహించరు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. దీన్ని ఇంతటితో వదిలే ప్రసక్తే లేదు. పబ్లిసిటీ కోసం సినీ పరిశ్రమలోని మహిళలను ఉద్దేశించి అమర్యాదకరంగా మాట్లాడటం కన్నా నీచమైనది మరొకటి ఉండదు' అంటూ ఆమె ట్వీట్ చేశారు.

More Telugu News