Drunk Driving: బుక్కైన మరో 75 మంది మందుబాబులు.. ఆరుగురు మహిళలు.. 40 కార్లు సీజ్

  • బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ సహా ఆరు చోట్ల తనిఖీలు
  • 40 కార్లు, 35 బైకులు సీజ్
  • తనిఖీలు చేపడుతున్నా... మందుబాబుల్లో మారని వైఖరి

మందు కొట్టి వాహనం నడిపే మందుబాబులపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రంకెన్ డ్రైవ్ లతో దడ పుట్టిస్తున్నారు. తాజాగా నిన్న రాత్రి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ సహా ఆరు చోట్ల డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోతాదుకు మించి మందు తాగిన 75 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉండటం విశేషం.

ఈ సందర్భంగా 40 కార్లు, 35 బైకులను పోలీసులు సీజ్ చేశారు. వీరందరినీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు, పోలీసులు భారీ ఎత్తున డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నప్పటికీ... మందు బాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు. యథాతథంగా మందు కొట్టి డ్రైవ్ చేస్తున్నారు.

More Telugu News