anasuya: ‘రంగస్థలం’ షూటింగ్‌కు సంబంధించి.. ఆసక్తికర ఫొటో పోస్ట్ చేసిన యాంకర్ అనసూయ

  • విడుద‌ల‌కు సిద్ధ‌మైన ‘రంగస్థలం’
  • ‘రంగస్థలం’లో ‘రంగమ్మత్త’ పాత్ర‌లో అన‌సూయ
  • షూటింగ్ జరుగుతోన్న సమయంలో సుకుమార్‌తో ముచ్చట
  • ‘గురువుగారికి రంగమ్మత్త గురోపదేశం’ అని పేర్కొన్న అనసూయ

రామ్ చ‌ర‌ణ్ తేజ్, సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న‘రంగస్థలం’ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో తాను ‘రంగమ్మత్త’ అనే పాత్ర‌లో న‌టిస్తున్నాన‌ని ఇటీవల యాంక‌ర్, న‌టి అన‌సూయ వెల్లడించడమే కాకుండా, ఈ సినిమాలోని త‌న లుక్ ను కూడా విడుద‌ల చేసింది. తాజాగా అన‌సూయ మ‌రో ఫొటో పోస్ట్ చేసి అల‌రించింది.

ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు సుకుమార్ తో క‌లిసి దిగిన ఫొటోను ఆమె పోస్ట్ చేసి ‘గురువుగారికి రంగమ్మత్త గురోపదేశం’ అని పేర్కొంది. ఈ ఫొటోలో అనసూయ ఒక పుస్తకం చేతిలో ప‌ట్టుకుని కుర్చీలో కూర్చొని, అక్క‌డికి వ‌చ్చిన సుకుమార్‌తో ముచ్చట్లాడుతోంది.

More Telugu News