sai pallavi: మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయిపల్లవి

  • నిన్ననే విడుదలైన 'నీదీ నాదీ ఒకే కథ' 
  • వేణు ఊడుగులకు మంచి పేరు 
  • తదుపరి చిత్రం సాయిపల్లవితో    

'ఫిదా' .. 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' సినిమాలు భారీ విజయాలను సాధించడంతో, తెలుగు ప్రేక్షకులకు సాయిపల్లవి బాగా చేరువైపోయింది. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా చేస్తోన్న 'పడిపడి లేచే మనసు' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తరువాత ఆమె మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది . . ఆ దర్శకుడి పేరే వేణు ఊడుగుల.

ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన 'నీదీ నాదీ ఒకే కథ' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి మార్కులు కొట్టేసింది. రీసెంట్ గా ఈ దర్శకుడు సాయిపల్లవిని కలిసి ఒక లైన్ వినిపించాడట. కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమా చేయడానికి ఆమె అంగీకరించిందని అంటున్నారు. పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో వేణు ఊడుగుల వున్నాడని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం వుంది.     

More Telugu News