charan: మెగాస్టార్ తో సినిమా గురించి సుకుమార్

  • చిరంజీవికి కథ వినిపించలేదు
  • ఆయనతో సినిమా చేయడం లేదు 
  • ఇదంతా కేవలం పుకారు మాత్రమే    

సుకుమార్ దర్శకత్వం వహించిన 'రంగస్థలం' ఈ నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. చాలాకాలం తరువాత గ్రామీణ నేపథ్యంలో కథా కథనాలను సుకుమార్ నడిపించిన తీరును ఇటీవల చిరంజీవి ఎంతగానో అభినందించారు. దాంతో ఈ సినిమా తరువాత చిరంజీవితోనే సుకుమార్ సినిమా ఉండొచ్చనే వార్తలు షికారు చేయడం మొదలైంది.

'సైరా' తరువాత సుకుమార్ తోనే సెట్స్ పైకి చిరంజీవి వెళతారని చెప్పుకుంటున్నారు. తాజాగా ఆ వార్తల పట్ల సుకుమార్ స్పందించాడు. చిరంజీవితో సినిమా చేయాలనేది తన 'కల' అనీ , అయితే ఆయనకి కథ వినిపించడం .. ఓకే చేయించుకోవడం జరిగిపోయాయంటూ జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని చెప్పాడు. దాంతో ఇప్పటివరకూ జోరుగా జరుగుతూ వచ్చిన ఈ ప్రచారానికి తెరపడినట్లయింది.    

More Telugu News