TRS: పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ ఎంపీల తీరు బాగోలేదు: ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి

  • ఎన్డీఏ సర్కారుకి టీఆర్‌ఎస్ చాలాసార్లు మద్దతు తెలిపింది
  • కేసీఆర్‌ శిఖండి పాత్ర పోషిస్తున్నారు
  • ప్రధాని మోదీ చేతిలో ఆయన పావులా మారారు
  • మా పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి టీఆర్‌ఎస్ పార్టీ మద్దతు తెలిపాలి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మండిపడ్డారు. అధికారంలోని వచ్చాక నాలుగేళ్లలో ఎన్డీఏ సర్కారుకి టీఆర్‌ఎస్ చాలాసార్లు మద్దతు తెలిపిందని, ఎన్డీఏపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోన్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ కంగారు పడుతోందని, కొత్త డ్రామా ఆడుతోందని అన్నారు. కేసీఆర్‌ శిఖండి పాత్ర పోషిస్తున్నారని, ప్రధాని మోదీ చేతిలో ఆయన పావులా మారారని జీనవ్ రెడ్డి ఆరోపించారు.

ఈ రోజు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన హక్కులను కాలరాసేలా టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి టీఆర్‌ఎస్ పార్టీ మద్దతు తెలిపాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంటులో టీఆర్ఎస్‌ ఎంపీలు నిరసన తెలుపుతోన్న తీరు సరికాదని అన్నారు.  

More Telugu News