charan: 'రంగస్థలం'లో పలకరించనున్న 'సవ్యసాచి' టీజర్

  • ఈ నెల 30వ తేదీన 'రంగస్థలం' రిలీజ్ 
  • ఆ సినిమాలో 'సవ్యసాచి' టీజర్ ప్రదర్శన 
  • భారీ క్రేజ్ కోసమే ఈ నిర్ణయం

చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య 'సవ్యసాచి' చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. చివరి షెడ్యూల్ ఏప్రిల్ 12 నుంచి అమెరికాలో మొదలవుతుంది. ఒకటి రెండు పాటలతో పాటు కొన్ని సన్నివేశాలను కూడా అక్కడ చిత్రీకరించనున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, విలన్ గా మాధవన్ కనిపించనున్నాడు.

ఈ నెల 27వ తేదీన ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను యూ ట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు. అలాగే ఈ నెల 30వ తేదీన విడుదలవుతోన్న 'రంగస్థలం' సినిమాకి ఈ టీజర్ ను జోడించనున్నారు. 'రంగస్థలం' సినిమాకి విపరీతమైన క్రేజ్ వుంది. భారీ అంచనాల మధ్య భారీ స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో 'సవ్యసాచి' సినిమా ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించడం కోసం 'రంగస్థలం' సినిమాకి టీజర్ ను అటాచ్ చేస్తున్నారు.  

More Telugu News