Telugudesam: ఆరోజున గుంట నక్కల గుట్టు విప్పుతా : ఏపీఆర్ఐసీ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి

  • మంత్రి అఖిల ప్రియతో విభేదాలు వాస్తవమే
  • ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోను
  • 29న ‘ఏవీ హెల్ప్ లైన్’ ప్రారంభిస్తున్నా 

గుంట నక్కలు తనను దెబ్బతీయాలని చూస్తున్నాయంటూ భూమా నాగిరెడ్డి ప్రథమ వర్ధంతి సభలో మంత్రి అఖిల ప్రియ ఇటీవల వ్యాఖ్యానించడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై భూమా నాగిరెడ్డి సన్నిహిత మిత్రుడు, ఏపీఆర్ఐసీ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా తాను పట్టించుకోనని, ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో టీడీపీ పటిష్టతకు తాను కృషి చేస్తానని అన్నారు. ఆ రెండు నియోజక వర్గాల్లో పార్టీ పటిష్టతకు కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆళ్లగడ్డలో ఈ నెల 29న ఏవీ హెల్ప్ లైన్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఆరోజున గుంట నక్కల గుట్టు విప్పుతానని చెప్పిన సుబ్బారెడ్డి, మంత్రి అఖిలప్రియతో విభేదాలు వాస్తవమేనని స్పష్టం చేశారు.

More Telugu News