kalyan ram: కల్యాణ్ రామ్ మాంఛి జోరు మీదే వున్నాడు

  • సొంత బ్యానర్ పై కల్యాణ్ రామ్ మూవీ
  • దర్శకుడిగా సినిమాటోగ్రాఫర్ గుహన్ 
  • ఏప్రిల్ 4 నుంచి రెగ్యులర్ షూటింగ్      

కల్యాణ్ రామ్ ఒక సినిమా తరువాత నిదానంగా మరో సినిమాను నిర్మిస్తూ .. హీరోగా ఒక సినిమా తరువాత మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, ఈ రెండు విషయాల్లోనూ నిదానమే ప్రధానం అనేట్టుగా ఉండేవాడు. అలాంటి కల్యాణ్ రామ్ ప్రస్తుతం హీరోగా దూకుడు చూపిస్తూ ఉండటం విశేషం. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'ఎమ్మెల్యే' .. నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఓపెనింగ్స్ బాగానే వున్నాయనే టాక్ వినిపిస్తోంది.

ఇక మే 25వ తేదీన 'నా నువ్వే' విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా ఇలా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, కల్యాణ్ రామ్ మరో ప్రాజెక్టును ఓకే చేశాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ .. ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. కల్యాణ్ రామ్ సొంత బ్యానర్ పై  .. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. మొత్తానికి కల్యాణ్ రామ్ మాంఛి జోరు మీదే వున్నాడు.           

More Telugu News