nagachaitanya: చైతూ కోసం వెయిటింగ్ ఇక్కడ: దర్శకుడు మారుతి

  • 'శైలజా రెడ్డి అల్లుడు' ఫస్టు షెడ్యూల్ పూర్తి 
  • రెండవ షెడ్యూల్ కి సన్నాహాలు 
  • 'సవ్యసాచి' షూటింగులో బిజీగా చైతూ      

నాగచైతన్య హీరోగా మారుతి ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. యూత్ .. మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన సిద్ధం చేసిన కథకి 'శైలజా రెడ్డి అల్లుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా ఎక్కడి వరకూ వచ్చిందనే విషయం తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తితో వున్నారు.

 ఈ నేపథ్యంలో మారుతి స్పందిస్తూ .. "అందరూ చైతూ మూవీ గురించి అడుగుతున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది.. రెండవ షెడ్యూల్ మాత్రం ఇంకా మొదలు కాలేదు. 'సవ్యసాచి' సినిమా పనుల్లో చైతూ బిజీగా ఉండటమే ఈ ఆలస్యానికి కారణం. నేను మీలాగే ఆయన కోసం వెయిటింగులో వున్నాను. ఈ సినిమా ఫస్టులుక్ ను మే నెలలో రిలీజ్ చేసే అవకాశాలు వున్నాయి. అప్పటివరకూ వెయిట్ చేయండి బ్రదర్స్ " అంటూ ట్వీట్ చేశాడు. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, రమ్యకృష్ణ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే.       

More Telugu News