somu veeraj: ఏపీలో బాత్రూమ్ లు కట్టకుండా వేల కోట్లు నొక్కేశారు: సోము వీర్రాజు ఆరోపణలు

  • చెట్టు-నీరు పథకంలో మట్టి అమ్ముకున్నారు
  • పట్టిసీమ ఎత్తిపోతలలో ఉన్న మెకానిజం ఏంటి?
  • టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ
  • అవినీతిని కింది స్థాయికి తీసుకెళ్లింది టీడీపీయే  

ఏపీలో బాత్రూమ్ లు కట్టకుండానే వేల కోట్లు నొక్కేశారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపణలు గుప్పించారు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.27 వేల కోట్లు కేంద్రం నుంచి వచ్చాయని, చెట్టు-నీరు పథకంలో మట్టి అమ్ముకున్నారని, పట్టిసీమ ఎత్తిపోతలలో ఉన్న మెకానిజం ఏంటి? స్పిల్ వేలో రూ.1400 కోట్ల ఖర్చు ఎందుకు అయిందో చెప్పాలని ప్రశ్నించారు.

మట్టి తీయడానికే రూ.67 కోట్లు ఇచ్చారని, మెయిన్ కెనాల్ లో కలపడానికి పంపు సెట్లకే రూ.817 వెచ్చించారని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీపై ఆయన విమర్శలు గుప్పించారు. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని అభివర్ణించారు. అవినీతిని కింది స్థాయికి తీసుకెళ్లిన పార్టీ టీడీపీయేనని ఆరోపించారు. ఏపీలో పరిపాలన గాడి తప్పుతోందని, ఎమ్మెల్యేలను అదుపు చేసే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు.

More Telugu News