Chandrababu: మన పోరాటం మరింత ఉద్ధృతం చేయాలి : సీఎం చంద్రబాబు

  • పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు
  • మిగిలిన రాష్ట్రాలకు కేంద్రం ఎలా సాయం చేస్తోంది?
  •  ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు చెప్పండి 
  • నేతలకు సూచించిన చంద్రబాబు

ఏపీకి జరుగుతున్న అన్యాయంపై మన పోరాటం మరింత ఉద్ధృతం చేయాలని సీఎం చంద్రబాబునాయుడు తమ పార్టీ నేతలకు సూచించారు. పార్లమెంట్ లో జరుగుతున్న పరిణామాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, శాసనసభ వ్యూహ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఏపీకి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నా, చేయట్లేదని, మిగిలిన రాష్ట్రాలకు ఎలా సాయం చేస్తోందని, ఈశాన్య రాష్ట్రాలకు రూ.3 వేల కోట్లు ఇచ్చారని, ఇది దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఏపీ అంటే అంత చిన్నచూపా? అంటూ కేంద్రాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల హక్కులు పరిరక్షించాలని, సభ లేనప్పుడు ఎక్కడికక్కడ ప్రజల్లోకి వెళ్లాలని, ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని చెప్పాలని చంద్రబాబు సూచించారు.

More Telugu News