totem: బ్యాంకులను మోసం చేసిన ‘టొటెం’ సంస్థ డైరెక్టర్లు అరెస్టు

  • డైరెక్టర్లు తొట్టెంపూడి సలలిత్, కవితను అరెస్టు చేసిన సీీబీఐ
  • హైదరాబాద్ లోని యూనియన్ బ్యాంకు ఫిర్యాదు 
  • కేసులు నమోదు చేసిన అధికారులు

వందల కోట్ల రూపాయల మేరకు బ్యాంకులను మోసగించిన వ్యవహారంలో టొటెం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్లను సీబీఐ అధికారులు ఈరోజు అరెస్టు చేశారు. ఆ సంస్థ డైరెక్టర్లు తొట్టెంపూడి సలలిత్, కవితలను బెంగళూరులో అరెస్టు చేసినట్టు సమాచారం. కాగా, మొత్తం 8 బ్యాంకులను రూ.1394 కోట్ల మేరకు సదరు సంస్థ మోసగించింది. హైదరాబాద్ లోని యూనియన్ బ్యాంకును రూ.313.84 కోట్ల మేరకు సదరు సంస్థ మోసగించింది. ఈ మేరకు యూనియన్ బ్యాంకు ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ డైరెక్టర్లు ఇద్దరు, మరికొందరిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. నిన్నటి నుంచి టొటెం గ్రూప్ సంస్థల్లో సీబీఐ సోదాలు చేసింది.




More Telugu News