laxman: వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నాగం పార్టీని వీడారు: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్

  • నాగం ఆరోపణలలో వాస్తవాలు లేవు 
  • టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలపై పోరాటానికి కమిటీ వేశాం
  • దానికి నాగం జనార్దన్ రెడ్డిని ఛైర్మన్‌గా నియమిస్తే ఆయన ఏమీ చేయలేదు

తెలంగాణ సీనియర్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేయడం వల్ల తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఈ రోజు బీజేపీ జాతీయాధ్యక్షుడికి నాగం జనార్దన్ రెడ్డి మెయిల్ ద్వారా రాజీనామా లేఖ పంపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. తాము పార్టీ సంప్రదాయాలకు భిన్నంగా ఆయనకు సముచిత స్థానం కలిపించామని చెప్పారు.

వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నాగం పార్టీని వీడారని, టీఆర్‌ఎస్‌ అవినీతిపై బీజేపీ పోరాటం చేయడం లేదంటూ నాగం చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని లక్ష్మణ్ అన్నారు. తాము టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలపై పోరాటానికి కమిటీ వేసి దానికి నాగం జనార్దన్ రెడ్డిని ఛైర్మన్‌గా నియమించామని, అయినప్పటికీ నాగం పోరాటం చేయలేదని అన్నారు.

More Telugu News