manchu vishnu: 'ఆచారి అమెరికా యాత్ర' కొత్త రిలీజ్ డేట్

  • మంచు విష్ణు హీరోగా 'ఆచారి అమెరికా యాత్ర'
  • కీలకమైన పాత్రలో బ్రహ్మానందం 
  • కథానాయికగా ప్రగ్యా జైస్వాల్  

మొదటి నుంచి కూడా మంచు విష్ణు యాక్షన్ కామెడీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఈ తరహా సినిమాలే ఆయనకి సక్సెస్ ను అందిస్తూ వచ్చాయి. అందువలన ఈ సారి కూడా తనకి అచ్చొచ్చిన యాక్షన్ కామెడీనే నమ్ముకుని, జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో 'ఆచారి అమెరికా యాత్ర' సినిమా చేశాడు. మంచు విష్ణుతో పాటు  బ్రహ్మానందం ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు.

ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్టు ఇంతకుముందే చెప్పారు. అయితే కొన్ని కారణాల వలన ఒక రోజు ఆలస్యంగా ఏప్రిల్ 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా ఈ సినిమా టీమ్ ప్రకటించింది. గతంలో విష్ణు - నాగేశ్వరరెడ్డి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సక్సెస్ కావడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు వున్నాయి. అమెరికాలోనే ఎక్కువభాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో, ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.   

More Telugu News