paritala sunita: మేము ఎన్డీఏ నుంచి బయటికొచ్చాక మీకు అవినీతి కనపడిందా?: బీజేపీపై పరిటాల సునీత ఫైర్

  • ఏపీ సర్కారుపై విష్ణుకుమార్ రాజు ఆరోపణలు
  • కౌంటర్‌ ఇచ్చిన పరిటాల సునీత
  • పట్టిసీమ అద్భుతంగా ఉందని గతంలో విష్ణుకుమార్ రాజు అన్నారని వ్యాఖ్య
  • ఇప్పుడు 'అవినీతి' అంటూ ఎలా మాట్లాడారో అర్థం కావట్లేదని విమర్శ

ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికొచ్చాక బీజేపీ నేతలకు ఏపీలో అవినీతి కనపడిందా? అని ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత ప్రశ్నించారు. ఈ రోజు శాసనసభలో బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ రూ.190 కోట్లు పట్టిసీమలో వృథాగా ఖర్చు పెట్టారని కాగ్ ఆరోపించిందని తెలుపుతూ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ.. పట్టిసీమ అద్భుతంగా ఉందని గతంలో విష్ణుకుమార్ రాజు అన్నారని, ఇప్పుడు ఈ విధంగా ఎలా మాట్లాడారో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతోనే బీజేపీ నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారని భావిస్తున్నామని అన్నారు. పట్టిసీమ వల్ల ఇప్పుడు రాయలసీమకు తాగు, సాగు నీళ్లు అందుతున్నాయని చెప్పారు. 

More Telugu News