Natasha Suri: 'బంగీ జంప్' చేస్తుండగా మాజీ మిస్ ఇండియాకి గాయాలు

  • ఇండోనేసియాలో దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లిన నటి
  • సాహసాలపై మక్కువతో బంగీ జంప్ చేసిన వైనం
  • తాడు తెగిపోవడంతో ప్రమాదం... ప్రస్తుతం స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స

ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్-2006 విజేత, బాలీవుడ్ నటి, వ్యాఖ్యాత నటాషా సూరీ ప్రమాదానికి గురయింది. బంగీ జంప్ సాహసం చేస్తుండగా ఆమె ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. ఇండోనేసియాలో ఓ దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె ఈ సాహసాన్ని చేసిందని సమాచారం. నటాషాకు మామూలుగానే ప్రయాణాలన్నా, సాహసాలన్నా విపరీతమైన ఆసక్తి. అందుకే ఈ బంగీ జంప్ సాహసం ఆమె చేసినట్లు తెలుస్తోంది.

ఈ సాహసం చేస్తున్నప్పుడు తాడు కొద్దిగా తెగిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. అయితే కింద రాళ్లూరప్పలు లేకుండా నీరు మాత్రమే ఉండటం వల్ల ఆమె నేరుగా నీళ్లలో పడిందని, అందువల్ల స్వల్ప గాయాలతోనే ఆమె తప్పించుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆమె ప్రస్తుతం ఇండోనేసియాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 'ఇన్‌సైడ్ ఎడ్జ్' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా ఆమె పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

More Telugu News