muralisharma: 'మెహబూబా' మూవీ ప్రత్యేకతల్లో ఇదొకటి!

  • పూరీ దర్శకత్వంలో 'మెహబాబా'
  • కొనసాగుతోన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు 
  • వేసవిలో విడుదల దిశగా ఏర్పాట్లు

  పూరీ జగన్నాథ్ .. తన తనయుడు ఆకాశ్ హీరోగా 'మెహబూబా' సినిమా చేస్తున్నాడు. ఇటీవలే షూటింగు పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల+ను జరుపుకుంటోంది. వేసవిలో ఈ సినిమాను విడుదల చేసే దిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సినిమాలో ఆకాశ్ జోడీగా నేహా శెట్టి నటించింది. దేశ సరిహద్దుల్లో కొనసాగే ఒక ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాలో మురళీశర్మ ఒక కీలకమైన పాత్రను పోషించాడు. ఇందులో ఆయన భార్య పాత్రను .. నిజజీవితంలో భార్య అయిన 'అశ్విని'నే పోషించడం విశేషం. అంటే నిజ జీవితంలో భార్యాభర్తలైన ఈ జంట .. ఈ సినిమాలో అలాగే కనిపించనున్నారన్న మాట. ఈ సినిమాకి గల ప్రత్యేకతల్లో ఇదొకటిగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మురళీశర్మ భార్య అశ్విని పలు సినిమాల్లోనూ .. సీరియల్స్ లోను నటిస్తూ వస్తున్నారు. ఈ సినిమా నుంచి ఆమె కూడా తెలుగులో మరింత బిజీ అవుతుందేమో చూడాలి.   

More Telugu News