redmi note 5 5pro: మరి కాసేపట్లో రెడ్ మీ నోట్ 5 ఫోన్ల ఫ్లాష్ సేల్

  • సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభం
  • ఫ్లిప్ కార్ట్, ఎంఐ వెబ్ సైట్ల నుంచి కొనుగోలుకు అవకాశం
  • బుల్లెట్ వేగంతోనే ప్రాసెస్ చేస్తేనే ఫోన్

చైనాకు చెందిన షియోమీ రెడ్ మీ నోట్ 5, నోట్ 5 ప్రో ఫోన్ల ఫ్లాష్ సేల్ నేటి మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది. ఫ్లిప్ కార్ట్, ఎంఐ డాట్ కామ్ సైట్లలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్ సేల్ ఆరంభమవుతుంది. కస్టమర్లు ముందుగానే లాగిన్ అయ్యి వేగంగా స్పందించడం ద్వారానే ఫోన్లను దక్కించుకునే అవకాశం ఉంటుంది.

 ఎందుకంటే వారానికో పర్యాయం మాత్రమే ఫ్లాష్ సేల్ నిర్వహిస్తుండడం ఎంఐ మార్కెటింగ్ గిమ్మిక్కు. అది కూడా కేవలం కొన్ని ఫోన్లనే ఫ్లాష్ సేల్ లో విక్రయానికి ఉంచి రెండు నిమిషాల్లోనే అవుట్ ఆఫ్ స్టాక్ అంటూ బోర్డ్ పెట్టేయడం కంపెనీ అనుసరిస్తున్న వ్యూహం. ఎంఐ ఫోన్ల పట్ల క్రేజ్ కొనసాగించేందుకే ఇలా చేస్తుందంటున్నారు మార్కెట్ నిపుణులు.

More Telugu News