bsnl: త్వరలో 5G సర్వీసులను ప్రారంభించబోతున్న బీఎస్‌ఎన్‌ఎల్!

  • వచ్చే ఏడాది నుంచి 5జీ సేవలు
  • ఈ ఏడాది చివరినాటికి 4జీ సేవలు
  • నోకియా, జడ్‌టీఈ, ఎన్‌టీటీ  లతో ఒప్పందం

ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు శుభవార్త. వచ్చే ఏడాది 5జీ సేవలను దేశ వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. ఇందుకోసం నోకియా, జడ్‌టీఈ, ఎన్‌టీటీ వంటి సంస్థలతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు.

అలాగే ఒక లక్ష వరకు వైఫై హాట్ స్పాట్లను ఏర్పాటు చేసి సంస్థ యొక్క రెవెన్యూ రూ.200-250 కోట్ల వరకు ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటివరకు దేశంలో బీఎస్‌ఎన్‌ఎల్ కి 3జీ సేవలు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ ఏడాది చివరినాటికి ఢిల్లీ, ముంబై తప్ప దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ 4జీ సేవలను ప్రారంభిస్తామని సంస్థ ఛైర్మన్ శ్రీవాస్తవ తెలిపారు.

More Telugu News