Rohit Sharma: టీ-20 క్రికెట్‌లో రోహిత్ శర్మ రికార్డు

  • టీ-20 క్రికెట్‌లో భారత్ తరపున 7వేల పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డు
  • ఒకటి, రెండు స్థానాల్లో కోహ్లీ, రైనా
  • బంగ్లాదేశ్‌తో ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘనత సాధించిన రోహిత్

టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ టీ-20 క్రికెట్‌లో భారత్ తరపున 7వేలకు పైగా పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు సురేశ్ రైనా, విరాట్ కోహ్లీ మాత్రమే ఈ పొట్టి ఫార్మాట్‌లో ఏడువేల పరుగుల మైలురాయిని దాటారు. శ్రీలంకలో నిన్నటితో ముగిసిన నిదాహాస్ టీ-20 ముక్కోణపు టోర్నీ సందర్భంగా రోహిత్ ఈ ఘనత సాధించాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగిన రోహిత్ 42 బంతుల్లో 56 పరుగులు చేశాడు. తద్వారా అతను టీ-20 క్రికెట్‌లో ఏడు వేల పరుగులు చేసిన ఆటగాళ్ల క్లబ్‌లో చేరిపోయాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు 270 టీ-20 మ్యాచ్‌లు ఆడి 7030 పరుగులు చేశాడు. ఇక సురేశ్ రైనా 275 మ్యాచ్‌లు ఆడి 7378 పరుగులు, విరాట్ కోహ్లీ 228 మ్యాచ్‌లలో 7095 పరుగులు చేశారు. కోహ్లీ-రోహిత్ మధ్య ఉన్న వ్యత్యాసం 65 పరుగులే. ఓవరాల్‌గా చూసుకుంటే పొట్టి ఫార్మాట్‌లో ఏడువేలకు పైగా పరుగులు చేసిన పదో ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు.

More Telugu News