charan: చరణ్ ను హత్తుకుని సురేఖ బోరున ఏడ్చేసింది: చిరంజీవి

  • చరణ్ అద్భుతంగా నటించాడు 
  • నేను .. సురేఖ ఉద్వేగానికి లోనయ్యాము 
  • చరణ్ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుంది  

చరణ్ కథానాయకుడిగా చేసిన 'రంగస్థలం' .. ఈ నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఎలా ఉండనుంది? .. చరణ్ నటన ఏ స్థాయిలో వుంటుందనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ సినిమా చరణ్ కెరియర్లోనే చెప్పుకోదగినదిగా నిలుస్తుందనీ .. చరణ్ నటన ప్రశంసలు అందుకునేలా ఉందని చిరంజీవి అన్నారు. ఇటీవల తన ఇంట్లో స్పెషల్ షో చూసిన ఆయన ఈ విధంగా స్పందించారు.

ఈ సినిమాతో చరణ్ ఓ మైలురాయిని చేరుకున్నట్టే అవుతుందనీ .. తండ్రిగా ఇది తనకెంతో గర్వాన్ని కలిగించే విషయమని చెప్పారు. తాను .. సురేఖ ఈ సినిమా చూసిన కొంతసేపటికి చరణ్ వచ్చాడనీ, ఈ సినిమా క్లైమాక్స్ లో చరణ్ ఫర్ఫా మెన్స్ ను చూసి ఉద్వేగానికి లోనైన సురేఖ, ఒక్కసారిగా అతణ్ణి హత్తుకుని బోరున ఏడ్చేసిందని అన్నారు. తాను కూడా ఎమోషనల్ అయినప్పటికీ .. బయటికి వ్యక్తం చేయకుండా ఉండిపోయానని చెప్పారు. తన కెరియర్లో ఓ 'ఖైదీ'లా .. చరణ్ కెరియర్లో 'రంగస్థలం' నిలిచిపోతుందని చెప్పుకొచ్చారు.      

More Telugu News