adnan sami: గుడి పడ్వాను పురస్కరించుకుని పాకిస్థానీ నెటిజన్ కు ఘాటు సమాధానమిచ్చిన అద్నాన్ సమీ

  • పాకిస్థానీ సంతతికి చెందిన అద్నాన్ సమీ
  • గుడి పడ్వాకు ట్విట్టర్ లో శుభాకాంక్షలు
  • పండగలను రాజకీయాల్లోకి లాగొద్దని హితవు

పాకిస్థానీ నెటిజన్ పై ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాని వివరాల్లోకి వెళ్తే... గుడిపడ్వా పండగను పురస్కరించుకుని అద్నాన్ సమీ అందరికీ శుభాకాంక్షలు ట్వీట్ చేశాడు. దీనిని చూసిన పాకిస్థానీ నెటిజన్, రంజాన్ నాడు మాకు కూడా విష్ చేయడం మర్చిపోరని ఆశిస్తున్నానని ట్వీట్ చేశాడు.

దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అద్నాన్ సమీ... రంజాన్ నీ ఒక్కడి పండగే కాదు, ప్రపంచంలోని ముస్లింలందరి పండగ. భారత్, పాక్ వివాదాల్లోకి పండగలను లాగొద్దని ఘాటుగా హితవు పలికాడు. వాస్తవానికి పాకిస్థాన్ లో కంటే భారత్ లోనే ఎక్కువ మంది ముస్లింలున్నారు అంటూ స్పష్టం చేశాడు. కాగా, పాకిస్థానీ మూలాలు కలిగిన అద్నాన్ సమీ పాక్ వదిలి భారత్ వచ్చేశాడు. భారత్ లో ఉండేందుకు పాకిస్థానీ పౌరసత్వాన్ని కూడా వదులుకున్నాడు. 2016లో ఆయనకు భారత పౌరసత్వం కూడా లభించింది.  

More Telugu News