Rangasthalam: 'రంగస్థలం'లో కీలక ట్విస్ట్ ను రివీల్ చేసిన మెగాస్టార్ చిరంజీవి!

  • చిట్టిబాబు అన్న పాత్ర కుమార్ బాబుగా నటించిన ఆది
  • కుమార్ బాబు మరణిస్తాడన్న చిరంజీవి
  • ఆపై పగ సాధించడమే క్లైమాక్స్!

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నిర్మితమైన 'రంగస్థలం' ఈ నెలాఖరులో విడుదలకు సిద్ధంకాగా, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి చిత్రంలోని కీలక ట్విస్ట్ ను రివీల్ చేశారు. ట్రైలర్ చూసిన వారికి సినిమా రాజకీయ నేపథ్యంలో ఉంటుందని అర్థమైపోగా, ఈ సినిమాను తాను చూశానని, ఇందులో చిట్టిబాబు సోదరుడు కుమార్ బాబు (ఆది) చనిపోతాడని చిరంజీవి చెప్పేశారు. దీంతో అన్నను చంపిన వారిపై పగదీర్చుకోవడమే చిత్రం క్లైమాక్స్ అని తెలిసిపోయింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కు అత్త పాత్రలో రంగమ్మత్తగా అనసూయ చాలా బాగా నటించిందని కూడా చిరంజీవి వ్యాఖ్యానించారు.

More Telugu News