Vishakha Sarada Peetham: ఏపీ సర్కారు కోసం మహాయజ్ఞం: స్వామి స్వరూపానంద

  • విళంబిలో ఏపీ సర్కారుకు అనిశ్చితి
  • దూరం చేసేందుకు యజ్ఞం చేస్తాం
  • త్వరలోనే చంద్రబాబుతో చర్చిస్తాం
  • విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద

విళంబి నామ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సర్కారుకు అనిశ్చితి తప్పదని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద జోస్యం చెప్పారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వ అనిశ్చితిని దూరం చేసేందుకు తాను ఓ మహాయజ్ఞాన్ని తలపెట్టినట్టు వెల్లడించారు. ఈ సంవత్సరం చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి కొన్ని చిక్కులు తప్పకపోవచ్చని అభిప్రాయపడిన ఆయన, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చిక్కులను దూరం చేసుకోవచ్చని అన్నారు. త్వరలోనే తాను చంద్రబాబును కలిసి, చేయాల్సిన యజ్ఞం గురించి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.

More Telugu News