rangasthalam: రంగస్థలం ప్రీ రిలీజ్ వేడుక ప్రారంభం.. కాసేపట్లో రానున్న చిరు, చెర్రీ, సమంత

  • విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద ఈవెంట్
  • భారీగా తరలివచ్చిన అభిమానులు
  • కాసేపట్లో ట్రైలర్ విడుదల

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద రామ్ చరణ్ తేజ్‌, సమంతల కొత్త సినిమా ‘రంగస్థలం’ ప్రీ రిలీజ్‌ వేడుక ప్రారంభమైంది. ఈ వేడుకకు మెగా అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరుకానున్నారు. మరికాసేపట్లో చిరంజీవి, రామ్ చరణ్ తేజ్, సమంత వేదిక వద్దకు చేరుకోనున్నారు.

ఇక ఈ సినిమా ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దర్శకుడు సుకుమార్ తీస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 1985 వాతావరణంలో పల్లెటూరు కథ నేపథ్యంలో సుకుమార్ ఈ చిత్రాన్ని తీస్తున్నారు. ఈ సినిమా టీజర్, పలు పాటలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. కాసేపట్లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.

More Telugu News