Chandrababu: చంద్రబాబుకు ఉన్న సమస్య బీజేపీతో కాదు: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్

  • వైసీపీతో మాత్ర‌మే చంద్రబాబుకు సమస్య
  • టీడీపీ తీసుకున్న నిర్ణ‌యం దురదృష్టకరం
  • ప్రత్యేక హోదా ఇవ్వలేకే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని తెలిపాం
  • ఈ విషయంలో బీజేపీని విమ‌ర్శించాల్సిన అవసరం లేదు

కేంద్ర ప్ర‌భుత్వం నుంచి వైదొల‌గిన టీడీపీ అనంత‌రం ఎన్డీఏ నుంచి కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసిన విష‌యం తెలిసిందే. దీంతో కేంద్ర మంత్రులు ఏ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నా టీడీపీ గురించి ప్ర‌శ్న‌లు ఎదుర్కోక త‌ప్పట్లేదు. తాజాగా, ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు కూడా ఈ విష‌య‌మై ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబుకు త‌మ పార్టీతో స‌మ‌స్య‌ లేదని, ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీతో మాత్ర‌మే ఉందని వ్యాఖ్యానించారు.

టీడీపీ తీసుకున్న నిర్ణ‌యం దురదృష్టకరమని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేకే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని తెలిపామ‌ని, ఈ విషయంలో త‌మ పార్టీపై అనుమానాలు వ్య‌క్తం చేస్తూ విమ‌ర్శించాల్సిన అవసరం లేదని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ మోదీయే ప్రధాని అవుతారని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. 

More Telugu News